వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జీతాలు, సబ్సీడీలపై దృష్టి పెట్టండి
హైదరాబాద్: పెరుగుతోన్న రాష్ట్రప్రభుత్వ ఉద్యోగస్థుల జీతాలు, పెన్షన్ లు, సబ్సీడీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా పరిణమించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.వీటిని వెంటనే తగ్గించే చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రముసాయిదా బడ్జెట్ పై జరుగుతోన్న చర్చల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లో ఆర్థిక నిపుణులు, పారిశ్రామకవేత్తలు, ఇతర మేధావులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
కేంద్ర నిధులు తగ్గడం కూడా ఆందోళన కల్గిస్తోందని వారుపేర్కొన్నారు. ఇక నుంచి గ్రామం యూనిట్ గా బడ్జెట్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముసాయిదాబడ్జెట్ పై సానుకూల స్పందన వచ్చినందున, ఇక నుంచి రెండు, మూడునెలలకు ముందుగానే బడ్జెట్ ప్రవేశపెడుతామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Story first published: Friday, February 7, 2003, 23:53 [IST]