వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చార్మినార్ సందర్శనకు విశేష స్పందన
హైదరాబాద్: 17 ఏళ్ళ తర్వాత చార్మినార్ పైకి ఎక్కేందుకు శుక్రవారం నుంచి అనుమతి ఇచ్చారు. చార్మినార్ పైకి ఎక్కి నగర అందాలను తిలకించాలన్న పర్యాటకుల, నగరవాసుల కోరిక ఎంత బలంగా ఉందో..తొలి రోజు సందర్శకుల క్యూను చూస్తే అర్థమయింది.
తొలిరోజైన శుక్రవారం దాదాపు 5 వేల మంది పర్యాటకుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు అధికంగా చార్మినార్ పైకి ఎక్కేందుకు ఉత్సాహం చూపారు.
వీకెండ్ రోజులైన శనివారం, ఆదివారం మరింత మంది ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 5 రూపాయల టికెట్ రుసుముతో చార్మినార్ సందర్శనకు అనుమతిస్తున్నారు.
Story first published: Friday, February 7, 2003, 23:53 [IST]