విద్యుత్పై సిఎంల సమావేశం
న్యూఢిల్లీ:
రాష్ట్రాల్లో
విద్యుచ్ఛక్తి
సంస్కరణలను
వేగవంతం
చేసేందుకు
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
ముఖ్యమంత్రుల,
విద్యుచ్ఛక్తి
మంత్రుల
సమావేశం
నిర్వహించనున్నారు.
2012
నాటికిఅందరికీ
విద్యుచ్చక్తిని
అందుబాటులోకి
తెచ్చేందుకు
చేస్తున్న
కృషిలో
భాగంగా
ఈ
సమావేశం
జరుగనుంది.
తాము గురువారం ప్రధానిని కలిశామని, 2001 మార్చిలో ఏర్పాటు చేసిన సమావేశం తదుపరి చర్యగా ఈ సమావేశం ఏర్పాటు చేయాలని తాము కోరామని,అందుకు ప్రధాని అంగీకరించారని, తేదీ త్వరలో ఖరారవుతుందనివిద్యుచ్ఛక్తి మంత్రి అనంత్ గీతే శుక్రవారంనాడు చెప్పారు. భారత పారిశ్రామిక సమాఖ్య(సిఐఐ) విద్యుచ్ఛక్తి పంపిణీపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రుల,విద్యుచ్ఛక్తి మంత్రుల గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో కొన్ని అవాంతరాలు చోటుచేసుకున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రాల, రాష్ట్రవిద్యుచ్ఛక్తి బోర్డుల స్థాయిల్లో ఈ అవాంతరాలు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు.