వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌పై సిఎంల సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో విద్యుచ్ఛక్తి సంస్కరణలను వేగవంతం చేసేందుకు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ముఖ్యమంత్రుల, విద్యుచ్ఛక్తి మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు. 2012 నాటికిఅందరికీ విద్యుచ్చక్తిని అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఈ సమావేశం జరుగనుంది.

తాము గురువారం ప్రధానిని కలిశామని, 2001 మార్చిలో ఏర్పాటు చేసిన సమావేశం తదుపరి చర్యగా ఈ సమావేశం ఏర్పాటు చేయాలని తాము కోరామని,అందుకు ప్రధాని అంగీకరించారని, తేదీ త్వరలో ఖరారవుతుందనివిద్యుచ్ఛక్తి మంత్రి అనంత్‌ గీతే శుక్రవారంనాడు చెప్పారు. భారత పారిశ్రామిక సమాఖ్య(సిఐఐ) విద్యుచ్ఛక్తి పంపిణీపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రుల,విద్యుచ్ఛక్తి మంత్రుల గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో కొన్ని అవాంతరాలు చోటుచేసుకున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రాల, రాష్ట్రవిద్యుచ్ఛక్తి బోర్డుల స్థాయిల్లో ఈ అవాంతరాలు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X