వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలిక్కిరాని సింగరేణి చర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సింగరేణి సమ్మెపై అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది. గురువారం అర్థరాత్రి వరకు కార్మికు సంఘాలకు, సింగరేణి యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు.

కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులతో మాట్లాడనున్నారు. కార్మిక సంఘాలు తమ డిమాండ్లను కొంత మేరకు సడలించుకుని ముసాయిదా ఒప్పందాన్ని రూపొందించి యాజమాన్యానికి సమర్పించాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో తాము మంత్రి వర్గ ఉపసంఘం మాట్లాడుతామని కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. మంత్రి వర్గ ఉపసంఘం సమయం ఇస్తే మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. ఈ సమావేశంలో సమస్యకు పరిష్కారం దొరకవచ్చునని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X