వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి మల్లింపునకు స్టీల్‌ ప్లాంట్‌ నిధులు!

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం ప్రజల నీటి అవసరాలను తీర్చే గోదావరి మల్లింపు ప్రాజెక్ట్‌ కు నిధులు సమకూర్చేందుకు విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ముందుకు వచ్చింది. అయితే, ప్లాంట్‌ కు కూడా నీటిని అందించాలని కోరింది. గోదావరి జలాల మల్లింపు పథకానికి దాదాపు 250 కోట్ల రూపాయలను రుణ ప్రాతిపాదికన అందిస్తామని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బ్రజ్‌ కిషోర్‌ త్రిపాఠి అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్‌ విస్తరణలో భాగంగా శుక్రవారం ఆయన తూర్పు కోక్‌ ఓపెన్‌ ప్లాంట్‌ ను ప్రారంభించారు. ఈ ఏడాది విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ 550 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిందని, ప్లాంట్‌ పనితీరు ప్రశంసనీయంగా ఉందని ఆయన మెచ్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X