లాంకోపై విమర్శలు చేయలేదు: వైఎస్
హైదరాబాద్: లాంకో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రాజగోపాల్ కాంగ్రెస్ లో లాంఛనంగా శనివారం చేరారు. ఇంతకుముందే ఆయన న్యూఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు సమక్షంలోకాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ..రాష్ట్ర కాంగ్రెస్ సభ్యుడిగా శనివారం గాంధీభవన్ లో చేరారు.
రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు,సీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తదితరుల ముఖ్యనేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం జరిగినవిలేకరుల సమావేశంలో రాజగోపాల్ విషయమై వైఎస్ ఇరుకున పడ్డారు.
గతంలో లాంకో విద్యుత్ సంస్థపైవిమర్శలు చేసిన మీరు రాజగోపాల్ చేరికను సమర్ధిస్తున్నారా అని ఒకవిలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇబ్బందిగా ఫీలయ్యారు. అయితే, తాను ఎప్పుడూ లాంకోపైవిమర్శలు చేయలేదని ఆయన సమర్ధించుకున్నారు.
లాంకో, జివికె గ్రూప్ ల విద్యుత్ ఒప్పందంవిషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టామే తప్ప ఆ సంస్థలను నేనువిమర్శించలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు, రాజగోపాల్ చేరికతో కృష్ణా,విజయవాడ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా మారుతుందని ఎమ్మెస్ ఆశాభావం వ్యక్తం చేశారు.