వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముసాయిదా బడ్జెట్పై విపక్షాల ధ్వజం
హైదరాబాద్:
రాష్ట్ర
ప్రభుత్వం
విడుదల
చేసిన
ముసాయిదాబడ్జెట్పై
ప్రతిపక్షాలు
తీవ్ర
విమర్శలు
చేశాయి.
ముసాయిదాబడ్జెట్పై
సోమవారం
జరిగిన
సదస్సులో
వివిధ
ప్రతిపక్షాల
నాయకులు
ప్రసంగించారు.
ప్రాధాన్యతారంగాలకు కోత విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వారన్నారు. ప్రాధాన్యతారంగాలకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు భ్రమింపజేస్తూ తర్వాత కోతపెట్టే విధానానికి ప్రభుత్వం పూనుకుంటోందని వారన్నారు.బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టసభనే కాకుండా ప్రజలను కూడా మోసం చేసే పద్ధతిని అవలంభిస్తోందని వారన్నారు. ప్రభుత్వం వివిధ రంగాల నుంచివిరమించుకుంటూ ప్రజలపై భారాలు వేస్తోందని అన్నారు. ఈ సదస్సులోకె. రోశయ్య (కాంగ్రెస్), బి.వి. రాఘవులు (సిపిఎం), తదితరులు పాల్గొన్నారు.
Story first published: Monday, February 10, 2003, 23:53 [IST]