వచ్చే నెల నుంచి వ్యాట్ అమలు
హైదరాబాద్:
వ్యాట్
అమలుకు
వచ్చే
శాసనసభా
సమావేశాల్లో
ఒక
బిల్లును
ప్రవేశపెట్టాలని
రాష్ట్ర
మంత్రివర్గం
నిర్ణయించింది.
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడి
అధ్యక్షతన
సోవామరం
రాష్ట్ర
మంత్రి
వర్గ
సమావేశంలో
ఈ
మేరకు
నిర్ణయం
తీసుకున్నారు.
వచ్చే నెల నుంచి వ్యాట్ను అమలు చేయడానికి ఈ బిల్లును ప్రతిపాదించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల క్రమబద్దీకరణకు కూడా ఒక బిల్లును ప్రతిపాదించాలని నిర్ణయించింది. మున్సిపాలిటీలు కేంద్ర నిధులను పూర్తిగా వినియోగించుకోకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో గవర్నర్ చేసే ప్రసంగంపై మంత్రివర్గం చర్చించింది. సమస్యల పరిష్కారం కోసం సూచనలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయే పద్ధతులపై సూచనలు చేయాల్సిందిగా చంద్రబాబునాయుడు మంత్రులనుకోరారు. కార్యక్రమాల అమలులోని లోటుపాట్లను సరిదిద్దడానికి అవసరమైన సూచనలు చేయాల్సిందిగా కూడా ఆయన అడిగారు.