వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఈ సాయంత్రం కావేరి సమావేశం
న్యూఢిల్లీ: ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడ్డ కావేరి రివర్ అథారిటీ సమావేశం ఎట్టకేలకు సోమవారం సాయంత్రం జరగనుంది. ప్రధాని వాజ్పేయి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత న్యూఢిల్లీ చేరుకున్నారు. కోరమ్ లేదన్న కారణంతో ఇప్పటివరకు వాయిదాపడ్డ సమావేశం - కోరం లేకున్నా ప్రధాని నిర్ణయం తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇరు రాష్ట్రాల నేతలు సమావేశానికి హాజరవుతున్నారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు జలాల విడుదలపై మొండి వైఖరి అనుసరిస్తున్నందున ఈ సమావేశం వల్లపెద్దగా ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ అనివిశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, కావేరి సమస్యకుశాశ్వత పరిష్కారం కనుక్కోవాలని జయలలిత ప్రధానిని కోరనున్నారు.
Comments
Story first published: Monday, February 10, 2003, 23:53 [IST]