వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి, డిజెఎస్‌ల బంద్‌లు పాక్షికం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ (బిజెపి), డిజెఎస్‌ పోటాపోటీగా ఇచ్చిన బంద్‌కు పిలుపునకు మంగళవారంమిశ్రమ స్పందన లభించింది. రాష్ట్రంలో జిహాదీ తీవ్రవాదాన్ని అడ్డుకోవాలని, డిజెఎస్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి బంద్‌కు పిలుపునిచ్చింది. బిజెపి డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ డిజెఎస్‌ బంద్‌ తలపెట్టింది.

బంద్‌ ప్రభావం తెలంగాణ ప్రాంతంలో అధికంగా కనిపించగామిగతా ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే ఉంది. చెదురుమొదురు సంఘటనలుమినహా బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో కూడా బంద్‌ పాక్షికంగానే జరిగింది. జంటనగరాల్లోనిఅమీర్‌పేట, చిక్కడ పల్లి, మరికొన్ని ప్రాంతాల్లో బస్సుల టైర్లలో గాలి తీసి రాస్తారోకో నిర్వహించిన బిజెపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజెపి కార్యకర్తలు దుకాణాలను బంద్‌ చేయించడానికి ర్యాలీలు నిర్వహించారు.

పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డిజెఎస్‌ బంద్‌ ప్రభావం కనిపించింది. నిజామాబాద్‌లో బిజెపి కార్యకర్తలతో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఘర్షణకు దిగడంతోస్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరులో బిజెపి కార్యకర్తలు పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X