డ్రిప్తో లక్షల ఎకరాలకు నీరు
హైదరాబాద్:
డ్రిప్
ఇరిగేషన్
ద్వారా
ప్రతి
మండలానికి
వేయి
ఎకరాల
చొప్పున
సాగునీటి
సౌకర్యం
కల్పించే
ప్రణాళికకుశ్రీకారం
చుడుతున్నట్లు
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
ప్రకటించారు.
ఆయన
మంగళవారం
జిల్లా
కలెక్టర్లతో,
వివిధ
ప్రభుత్వ
శాఖల
ఉన్నతాధికారులతో
వీడియో
కాన్ఫరెన్స్
నిర్వహించారు.
జన్మభూమి,
ఇతర
14అంశాలపై
ఆయన
వీడియో
కాన్ఫరెన్స్
ద్వారా
సమీక్ష
జరిపారు.
వ్యవసాయ శాఖ పనితీరును, కరవు సహాయక చర్యలు ఆయన సమీక్షిస్తూ- రాష్ట్రంలోని ఆరు లక్షల ఎకరాలకు 1200 కోట్ల రూపాయలతో డ్రిప్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో 600 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని,మిగతా మొత్తాన్ని రుణంగా సమకూరుస్తుందని ఆయనవివరించారు.
రైతుల పంటలకు తగిన మార్కెట్, నిల్వ సామర్థ్యం లేకపోవడంతో గిట్టుబాటు ధర లభించలేదని ఆయన అన్నారు. అభివృద్ధి సూచికల ఆధారంగా పనితీరునుఅంచనా వేయడంలో మంత్రులు, అధికారులు సరిగా వ్యవహరించడం లేదని ఆయన మందలించారు. దీంతో అభివృద్ధి సూచికల తయారీ పద్ధతి మార్చాలని కొందరు సూచించారు.అందుకు చంద్రబాబు అంగీకరించారు.