వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూత్వ అందరిదీ: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హిందూత్వ అనేది మతం గానీ, ప్రార్థనావిధానం గానీ కాదని, అది సమాజంలోని అన్ని వర్గాలను తనలో ఇమిడ్చుకుంటుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు.

హిందూత్వ జాతికులాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంబంధించిందని, దీనికి కాలం లేదని ఆయన అన్నారు.గత భారతీయ జన సంఘ్‌ వ్యవస్థాపకుడు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటయిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

మానవత్వం ఒక్కటేనని, ఏ సామాజిక శ్రేణిని గానీ, దేశంలోని ఏ ప్రాంతాన్నీ గానీ విస్మరించడం జరగదని, తమ లక్ష్య సాధనకుసరైన మార్గంలో నడుస్తున్నామా లేదా అనేవిషయంపై చర్చ జరగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.అంశాలపై విభిన్న అభిప్రాయాలు వుండవచ్చునని, అయితే అంత మాత్రాన అనుసరణకు ఎవరికి వారే విభిన్న పంథాలున్నాయని అనుకోరాదని ఆయన అన్నారు. ఆందోళన చెందడానికి బదులు ఆత్మపరిశీలన చేసుకోవడం ఇప్పుడు అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X