ఇద్దరు జవాన్లను కాల్చిచంపిన వార్
కరీంనగర్:
కరీంనగర్
జిల్లాలో
ఇద్దరు
పోలీసు
కానిస్టేబుళ్లనుపీపుల్స్వార్
నక్సలైట్లు
మంగళవారం
సాయంత్రం
కాల్చి
చంపారు.
కరీంనగర్
జిల్లా
కోనరావుపేట
మండలంలోని
మట్టిమల్ల
తండాలో
నక్సలైట్లు
ఈ
చర్యకు
పాల్పడ్డారు.
కొడిమ్యాల పోలీసు స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు హెంకూ నాయక్ (30), కృష్ణ (35) మట్టిమల్ల తండాకు వెళ్లారు. హెంకూనాయక్ అత్తగారిఊరైన మట్టిమల్ల తండాకు డబ్బు తెచ్చుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం మోటార్సైకిల్పై వెళ్లారు. సాయంత్రం పీపుల్స్వార్ నక్సలైట్లు తండాకు వచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చినవిషయం తెలుసుకున్న నక్సలైట్లు వారిని బయటకు తీసికెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత తుపాకులతో ఆరు రౌండ్లుపేల్చి వారిని హత్య చేశారు.
కొడిమ్యాలకు చెందని కృష్ణకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. తులసీనాయక్ తండాకు చెందిన హెంకూ నాయక్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.పీపుల్స్వార్ మద్దిమల్ల ఎల్.జి.ఎస్. కార్యదర్శి బాబు దళం, ఏరియా కమిటీ కార్యదర్శిస్వరూపక్కల ఆధ్వర్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.