వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరువుపై ప్రభుత్వం అలక్ష్యం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: కరువు సహాయ చర్యలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కరువు పీడిత గ్రామాల్లో పర్యటించారు.

కరవు ప్రాంతాల్లోని ప్రజలకు పని కల్పించాలనే ధ్యాస ప్రభుత్వానికి లేదని ఆయనవిమర్శించారు. తాగునీటి కల్పనలో కూడా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. కరువు సహాయాన్నిఅందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. బతకడానికి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము ఎంతగా మాట్లాడినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X