ఆసీస్ పై కుంబ్లే, హర్భజన్ అస్త్రాలు
తొలి మ్యాచ్ లో కనాకష్టంగా నెగ్గిన భారత్ ఆసీస్ పై గెలిచేందుకుసరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను ప్రధాన ఆయుధాలుగా వాడుకోవాలని టీంమేనేజ్ మెంట్ భావిస్తోంది.
శనివారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న మ్యాచ్ లో ఆసీస్ మిడిల్ ఆర్డర్ కూల్చే భాద్యత ఈ ఇద్దరి స్పిన్నర్లదే. పాకిస్థాన్ ఓటమికి కారణం..మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తీసుకురాలేకపోవడమేనని గ్రహించిన టీం ఈ ప్లాన్ ను రచిస్తోంది.
మరోవైపు, పాకిస్థాన్ జట్టు కోచ్ రిచర్డ్పైబస్ కూడా ఇదే సరైన మార్గమని అభిప్రాయపడుతున్నారు. ఆడమ్ గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్ వంటి అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ పై నెగ్గాలంటే కుంబ్లే, హర్భజన్ లనేఅస్త్రాలుగా వాడుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
ముఖ్యంగా కుంబ్లే తరహా బౌలింగ్ దక్షిణాఫ్రికా పిచ్ లకు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తొలిమ్యాచ్ లో కుంబ్లే బౌలింగ్ తీరును ఆయన ప్రసింశించాడు. ఈ మ్యాచ్ లో కుంబ్లే నాలుగువికెట్లు తీశాడు.