బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతల భేటీ
న్యూఢిల్లీ:
విభేదాలు
తీవ్రతరమైన
నేపథ్యంలో
గురువారం
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి),
రాష్ట్రీయస్వయం
సేవక్
(ఆర్ఎస్ఎస్)
నాయకుల
మధ్య
సమావేశం
జరిగింది.
పరస్పరం
బురద
చల్లుకోవడం
మానుకోవాలని
ఇరు
పక్షాల
నాయకులు
ఈ
సమావేశంలో
ఒకఅంగీకారానికి
వచ్చారు.
ఈ
సమావేశం
రెండున్నర
గంటల
పాటు
సాగింది.
అయోధ్యపై సయోధ్య కోసమే ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు.విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి), రామజన్మభూమి న్యాస్లు రెచ్చగొట్టే ప్రకటలు చేయడం మానుకోవాలని బిజెపి సూచించినట్లు సమాచారం.
అయోధ్యపై కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉన్నదని బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ సమావేశానంతరంవిలేకరులతో అన్నారు. తాము రామాలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. అయోధ్యలోదివివాదాస్పద స్థలం కాదని ఆయన అన్నారు. అయితేవివాదం తలెత్తినందున సభ్య సమాజంలో న్యాయస్థానం నిర్ణయంకోసం వేచి చూడక తప్పదని ఆయన అన్నారు.