కేంద్ర వినతికి సుప్రీం తిరస్కరణ
న్యూఢిల్లీ:
అయోధ్యలోని
77
ఎకరాల
స్థలంలో
మత
కార్యకలాపాలను
నిషేధిస్తూ
సుప్రీంకోర్టు
ఇచ్చిన
ఆదేశాలను
తొలగించాలని
దాఖలు
చేసిన
పిటిషన్పైవిచారణను
త్వరగా
చేపట్టాలని
చేసిన
విజ్ఞప్తిని
సుప్రీంకోర్టు
గురువారం
త్రోసి
పుచ్చింది.
అయోధ్యలో
1992లో
కట్టడం
విధ్వంసం
తర్వాత
ఆ
స్థలాన్ని
ప్రభుత్వంస్వాధీనం
చేసుకున్నది.
ప్రభుత్వ విజ్ఞప్తిపై విచారణను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని సొలిసిటర్ జనరల్ కిరీట్ రావాల్ ఛీఫ్ జస్టిస్వి.ఎన్. ఖారే, జస్టిస్ ఎస్.పి. సిన్హా, జస్టిస్ ఎ.ఆర్. లక్ష్మణన్లతో కూడిన బెంచ్నుకోరారు. ముందు నిర్ణయించిన ప్రకారం విచారణ 21వ తేదీననే జరుగుతుందని బెంచ్ స్పష్టం చేసింది.
అయోధ్యలోని స్థలాన్ని తమకు అప్పగించడంలో ప్రభుత్వంవిఫలమైతే అక్కడ రామాలయం నిర్మించేందుకు కార్యక్రమాన్ని రూపొందించేందుకువిశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) ఈ నెల 22వ తేదీన ధర్మసంసద్ను ఏర్పాటు చేసింది.