వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్లు వద్దు, లిక్కర్‌ కు ఓకే?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ కంపెనీల ప్రోత్సాహంతో కల్లును నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణా రాష్ట్రసమితి నేత కె.చంద్రశేఖరరావు ఆరోపించారు. కల్తీకల్లు పారుతోందనిపేర్కొంటూ ఎక్సైజ్‌ శాఖ దాడులు నిర్వహిస్తోంది, కానీ కల్తీకల్లు నివారించడం మాని దాన్ని పూర్తిగా నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆయనవిమర్శించారు.

గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...కల్తీకల్లుకు కారణం..ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరినేనని అన్నారు. నల్గొండ వంటి జిల్లాల్లో కల్లుగీసే ఒక తాడిచెట్టు నుంచి ప్రభుత్వం 11 రూపాయల రుసుము వసూలు చేస్తోంది. అదే హైదరాబాద్‌ జిల్లాల్లో 530 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ తారతామ్యమే కల్తీకి గేట్లు తెరుస్తుంది. గేట్లు మూసే మార్గం ప్రభుత్వం వద్దే ఉంది. దాన్ని పక్కనపెట్టి పక్క మార్గాలు అనుసరించడమేమిటని
ఆయన ప్రశ్నించారు.

లిక్కర్‌ కంపెనీల డబ్బు సంచుల కారణంగా ప్రభుత్వం గీత కార్మికులు, వ్యాపారులపై దాడుల చేస్తోందని చంద్రశేఖరరావువిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X