వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరవు కొంపముంచుతోంది: చంద్రబాబు
వరంగల్: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న కరువు అన్ని రంగాలపై విపరీతమైన ప్రభావం చూపుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అభివృద్ధి పనులు దీనివల్లే నిలిచిపోయాయన్నారు. అయితే, రైతులను, వ్యవసాయల కూలీలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిను రూపొందించిందని ఆయన తెలిపారు.
గురువారం వరంగల్ జిల్లా రేగొండ వద్దశ్రీరాంసాగర్ కాల్వ ద్వారా ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసింగించారు. పశుగ్రాసం పంపిణీ కోసం రూపొందించిన ప్రణాళికవివరాలను త్వరలో తెలియచేస్తామన్నారు.
సాగునీటిని వృధాచేయకుండా, నీటని పొదుపు చేయడం ప్రజలు అలవర్చుకోవాలని ఆయన అన్నారు.అకాలంగా వచ్చిన కరువు అన్ని జిల్లాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని ఆయనఅంగీకరించారు.
Comments
Story first published: Thursday, February 13, 2003, 23:53 [IST]