వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చలి హుష్ కాకి, ముదిరిన ఎండలు
హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత పూర్తిగా తగ్గడమే కాకుండా వేసవి ప్రతాపం అప్పుడే మొదలైంది. గత ఏడాది వర్షాలు సరిగా పడకపోవడం, గాలిలో తేమ పెరగడం కారణంగా రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగాపెరిగాయి. వారం రోజుల క్రితం 24, 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రస్తుతం పగటి పూట హైదరాబాద్ లో సగటున గరిష్టంగా 35.8 డిగ్రీలు నమోదు అవుతోంది.
అనంతపూర్, కర్నూలు, నంద్యాలలో గరిష్టంగా 36 డిగ్రీలు నమోదు కావడాన్ని బట్టి తీవ్రతనుఅర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ సారి భానుడి ప్రతాపానికి తెలుగు ప్రజలు విలవిలలాడక తప్పేట్లు లేదు.
Comments
Story first published: Friday, February 14, 2003, 23:53 [IST]