వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీలో కృష్ణారావుపై చర్చ?
హైదరాబాద్: కొల్లాపూర్ ఎమ్మెల్యే కృష్ణారావుఅరెస్ట్ పై సోమవారం నుంచి జరిగే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆయనఅరెస్ట్ కు నిరసనగా శుక్రవారం సచివాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు, కరవుతో బాధపడుతోన్న రైతులను వదిలి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్దతు ఇస్తున్నారనిపీసీసీ అధ్యక్షుడు ఎంసత్యనారయణరావు విమర్శించారు. తమ పార్టీఅసెంబ్లీ ఈ అంశాన్ని లేవదీసి ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు.
Comments
Story first published: Friday, February 14, 2003, 23:53 [IST]