విశ్లేషణ: తీరు మారని గంగూలీ
పేపర్ హీరోలు కుప్పకూలిన వైనం భారతీయులనుఅందర్నీ తీవ్రంగా కలిచివేసింది. భారత్ సూపర్సిక్స్ వెళుతుందా అనేది ఇప్పుడు అందరి మదిలో మెదలుతోన్న ప్రశ్న. మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న భారత్ ఒక్క నమీబీయా జట్టుమీద మినహీ మిగతా, పాకిస్థాన్, జింబాబ్వే, ఇంగ్లాండ్ లపై భారత్ గెలవడం కష్టమేననిఅందరి అభిప్రాయం. హాలెండ్ పై భారత్ బ్యాట్స్ మెన్విఫలం కావడాన్ని భారత్ కెప్టెన్ గంగూలీ పిచ్ కారణమని అని విశ్లేషించాడు.
శనివారం నాటి ఆటపై అదే సాకు చెప్పలేకపోయాడు. మ్యాచ్ అనంతరం పాత పద్దతిలో మన బోయ్స్ బాగా ఆడాల్సింది అని పాట పాడాడు. తనపేలవమైన బ్యాటింగ్ తీరుపై, సుసైడల్ ఆటతీరుపై మాత్రంపెదవి విప్పలేదు.
గొర్రెల మనస్థత్వం భారత్ ఆటగాళ్ళు ఎప్పుడు వీడుతారు? శనివారం నాటి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్. అవును. బ్యాట్స్ మెన్ కు అనుకూలించే పిచ్ ఇది. కనీసం 250 పరుగులు చేసి ఉంటే బాగుండేది. అని కుంబ్లే మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.