వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపే అసెంబ్లీ: విపక్షాలు సిద్దం
హైదరాబాద్: సోమవారం నుంచి రోజుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలన్నీ సిద్దం అయ్యాయి. విద్యుత్ వంటిఅంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మిత్రపక్షం బీజేపీ కూడా రెడీ అవుతోంది. కీలకమైన ప్రజా సమస్యలపై తమ పార్టీ దృష్టి పెడుతుందనిసీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలిపారు.
సమయం వృధా కానివ్వకుండా చర్యలు తీసుకుంటూనే..ప్రజాసమస్యలపై రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, టీడీపీ కూడావిపక్షాలను ఎదుర్కొనేందుకు సంసిద్దమైంది. ఈ సారి సమావేశాల్లోపెరుగుతోన్న అప్పులు, విద్యుత్ కోత, కరువు ప్రధానఅంశాలు కానున్నాయి.
Comments
Story first published: Sunday, February 16, 2003, 23:53 [IST]