వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధానితో చంద్రబాబు సమావేశం
న్యూఢిల్లీ: ఆదివారం న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అటల్బిహారీ వాజ్ పేయితో రెండున్నర గంటలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ, ఆర్థికమంత్రి జశ్వంత్ సింగ్లతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు కూడా పాల్గొనడంతో సమవేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే, తాము ఎటువంటి రాజకీయఅంశాలు మాట్లాడుకోలేదని, కేవలం త్వరలో ప్రవేశపెట్టనున్నబడ్జెట్, దేశ ఆర్థికరంగ అభివృద్ధిపైనే ప్రధానంగా చర్చించామని చంద్రబాబు నాయుడువిలేకరులకు తెలిపారు. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అయోధ్యఅంశం గురించి చర్చించారా అని ప్రశ్నించగా..ఆ ప్రస్తావనే రాలేదన్నారు.
Comments
Story first published: Sunday, February 16, 2003, 23:53 [IST]