వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానితో చంద్రబాబు సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదివారం న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌ పేయితో రెండున్నర గంటలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ, ఆర్థికమంత్రి జశ్వంత్‌ సింగ్‌లతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు కూడా పాల్గొనడంతో సమవేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

అయితే, తాము ఎటువంటి రాజకీయఅంశాలు మాట్లాడుకోలేదని, కేవలం త్వరలో ప్రవేశపెట్టనున్నబడ్జెట్‌, దేశ ఆర్థికరంగ అభివృద్ధిపైనే ప్రధానంగా చర్చించామని చంద్రబాబు నాయుడువిలేకరులకు తెలిపారు. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో అయోధ్యఅంశం గురించి చర్చించారా అని ప్రశ్నించగా..ఆ ప్రస్తావనే రాలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X