వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చికాగోలో 21మంది మృతి
చికాగో: చికాగోలోని ఓ నైట్ క్లబ్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 21 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మరో 19 మంది గాయపడ్డారు.
ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. క్లబ్ లో గొడవ జరుగుతుండడంతో ...దాన్ని నివారించేందుకుసెక్యూరిటీ సిబ్బంది..మిరియాల పొడి స్ప్రేను జల్లారు. దీంతో క్లబ్ లో ఉన్న వారందరూ భయంతో పరుగెత్తడం మొదలుపెట్టారు.
ఈ తొక్కిసలాటలో 21 మంది చనిపోయారని పోలీసులు తెలిపారు. 1000 మంది వరకు క్లబ్ లో ఉండగాఅందులో అనేకమంది మిరియాల పొడి వాయువులకు వాంతులు చేసుకున్నారు. ఊపిరాడక చాలామంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
Comments
Story first published: Monday, February 17, 2003, 23:53 [IST]