వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్‌ ప్రదర్శన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభబడ్జెట్‌ సమావేశాల తొలి రోజు సోమవారం కాంగ్రెస్‌ సభ్యులు కరువుపై ప్రదర్శన నిర్వహించారు. శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కాంగ్రెస్‌ శాసనసభ్యుడు డి. నాగేందర్‌ ప్రతిపక్షాల నాయకులకు చూపించి కరువు పరిస్థితులనువివరించారు. కరువు సహాయ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వంవిఫలమైందంటూ కాంగ్రెస్‌ సభ్యులు గవర్నర్‌ ప్రసంగం చేసినంత వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిలబడ్డారు.

కాంగ్రెస్‌ మహిళా శాసనసభ్యులు ఖాళీ బిందెలతో శాసనసభలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ తమ పార్టీల జెండాల రంగులు గల దుస్తులను ధరించి సభ్యులు శాసనసభకుహాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యులు ప్రత్యేక బ్యాడ్జీలు ధరించి శాసనసభకుహాజరయ్యారు. తొలి రోజు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వివిధ పక్షాల నాయకుల వద్దకు వెళ్లి కరచాలనం చేసి పలకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X