వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.1200 కోట్లతో పథకం: గవర్నర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో సూక్ష్మ స్థాయి సాగునీటి పథకాన్ని చేపట్టనున్నట్లు గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా చెప్పారు. శాసనసభను ఉద్దేశించి ఆయన సోమవారం ప్రసంగం చేశారు. ఈ పథకం అమలుకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

గత రెండేళ్ల కరువు పరిస్థితులు ఏర్పడడం వల్ల తీవ్ర నీటి ఎద్దడి, తాగు నీటి సమస్య తలెత్తిందని, కరువును ఎదుర్కునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. కరువు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు పలు సామాజిక భద్రతా పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.

రెండున్నర లక్షల హెక్టార్లకు సాగునీరందించే ఈ పథకాన్ని ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. డ్రిప్‌ స్ప్రింకర్లు, బిందుసేద్యం ద్వారా పంటల దిగుబడిని పెంచనున్నట్లు ఆయన తెలిపారు. కరువు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం,పేదరిక నిర్మూలన తదితర కార్యక్రమాలను ఆయన ప్రస్తావిస్తూవీటిని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఆయన చెప్పారు. సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X