వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల సమస్యల ప్రస్తావన ఏదీ?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ సూర్జీత్‌ సింగ్‌ బర్నాలాఅసెంబ్లీ ప్రసంగంపై విపక్షాలన్ని పెదవి విరిచాయి. కరవు, రైతుల సమస్యల ప్రస్తావన లేకుండా గవర్నర్‌ ప్రసంగం సాగిందనిసీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి విమర్శించారు. కరవుపై తీసుకుంటోన్న చర్యలపై గానీ,రైతాంగానికి సంబంధించి ఎటుంటి హామీ గవర్నర్‌ ప్రసంగంలో లేదని ఆయన అన్నారు.

కనీసం కరువు గురించిన ప్రస్తావన కూడా లేకపోవడం సిగ్గుచేటని వై.ఎస్‌ ఘాటుగా స్పందించారు.ఇన్నాళ్లూ ఐటి అని ఊదరగొట్టిన ప్రభుత్వం దాన్ని చివరిపేజీకి మార్చింది. కొత్తగా బి.టి అని తీసుకొచ్చింది. రోజుకో దాన్ని ప్రస్తావించడమే గానీ వాస్తవ సమస్యల గురించి ప్రస్తావన లేదని టీఆర్‌ఎస్‌ నేత కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. మిత్రపక్షం బిజెపి వ్యంగ్యవ్యాఖ్యలు చేసింది.

గవర్నర్‌ ప్రసంగంలో కొత్తదనం లేదని అభిప్రాయపడింది. పాత ప్రసంగాలను మళ్ళీ జిరాక్స్‌ తీసి చదివినట్లు ఉంది. తేడా అల్లా గవర్నర్‌ లు మారారని బిజెఎల్‌ పి నేత ఇంద్రాసేనరెడ్డి వ్యంగ్యబాణాలువిసిరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X