అయోధ్యపై లోక్సభలో గందరగోళం
న్యూఢిల్లీ:
అయోధ్య
వివాదంపై
తక్షణ
చర్చ
జరగాలని
ప్రతిపక్షాలు
పట్టుబడడంతో
మంగళవారం
లోక్సభలో
తీవ్ర
గందరగోళం
చెలరేగింది.
ప్రశ్నోత్తరాల
సమయాన్ని
వాయిదా
వేసి
అయోధ్యవివాదంపై
చర్చ
చేపట్టాలని
ప్రతిపక్షాలు
లోక్సభ
సమావేశం
కాగానే
పట్టుబడడం
మొదలుపెట్టారు.
లోక్సభ
కార్యకలాపాల
సలహా
సంప్రదింపుల
కమిటీ
(బిఎసి)లో
నిర్ణయం
తీసుకునే
వరకు
ఆగాలనిస్పీకర్
మనోహర్
జోషీ
సూచించారు.
ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రతిపక్ష నేతలు ములాయంసింగ్, సోమనాథ్ ఛటర్జీ, శివరాజ్ పాటిల్ మాట్లాడుతున్న సమయంలో ఈ వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. కీలకమైనఅంశాలపై నిర్ణయం జరగాల్సి ఉన్న తరుణంలో సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా విభజన ధోరణులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వారువిమర్శించారు.
ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేసి అయోధ్యవివాదంపై చర్చకు అనుమతించాలని సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ డిమాండ్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ- ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని బిజెపి సభ్యులువినయ్ కతియార్, కీర్తి ఆజాద్ అన్నారు. దేశభక్తి బిజెపి సొత్తు కాదని, దేశాన్ని బిజెపి విభజించే ప్రయత్నం చేస్తోందని, తాము ఐక్యంగా వుంచే ప్రయత్నం చేస్తున్నామని సిపిఎం నేత సోమనాథ్ ఛటర్జీ అన్నారు. దీన్ని బిజెపి సభ్యులుపెద్ద యెత్తున వ్యతిరేకిస్తూ అల్లరి చేశారు.