వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ నుంచి సిపిఎం వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ భూముల నుంచి గిరిజనులను బేదఖల్‌ చేసే విధానానికిస్వస్తి చెప్పే విషయంలో ప్రభుత్వం సరైన సమాదానం ఇవ్వనందుకు నిరసనగా సిపిఎం సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం గిరిజన భూముల అన్యాక్రాంతంఅంశం చర్చకు వచ్చింది.

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సామూహిక అటవీ సంరక్షణ యాజమాన్యం ద్వారా గిరిజనులను తమ భూములను నుంచి వెళ్లగొడుతున్నారని, గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని నోముల నర్సింహయ్య(సిపిఎం) విమర్శించారు. పాశ్చాత్య సంస్కృతితో గిరిజనుల జీవితాలనుధ్వంసం చేస్తున్నారని ఆయన అన్నారు. గిరిజన భూముల అన్యాక్రాంతంవివరాలను కేంద్రానికి పంపుతామని అటవీ శాఖ మంత్రి అయ్యన్నపాత్నుడు చెప్పారు. మంత్రి సమాధానంఅస్పష్టంగా ఉన్నందుకు నిరసన వ్యక్తం చేస్తూ సిపిఎం సభ్యులు వాకౌట్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X