వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
14మంది నక్సలైట్లు లొంగుబాటు
వరంగల్: జనశక్తి గ్రూప్ కు చెందిన 14 మంది నక్సలైట్లు వరంగల్ లో మంగళవారం రాష్ట్ర డిజిపిపేర్వారం రాములు సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.వీరంతా వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు చెందినవారు.
జనగామ ఏరియా ఇన్ ఛార్జి బంకా శ్రీనివాస్ కూడా లొంగిపోయాడు. నక్సలైట్లు బూటకపు నక్సలైట్లుగా మారరాని ఆయన పేర్కొన్నాడు.స్వార్థం కోసం హింసాత్మక మార్గాన్ని అవలంభించడంమినహా సిద్దాంతం కోసం పనిచేసే భావన లేదని..వార్ కలాపాలు బూటకంగా మారాయని,అందుకే తాము లొంగిపోతున్నట్లు వారు విలేకరులకు తెలిపారు. జనశక్తి గ్రూప్ పై నిషేధం విధించే యోచన ఉందని, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నుట్లు డిజిపి ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Story first published: Tuesday, February 18, 2003, 23:53 [IST]