కృష్ణారావు పై సభలో గందరగోళం
హైదరాబాద్: జైలు నుంచి వచ్చిన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన ప్రసంగం ఆసాంతం సభలో గందరగోళమే. 304 నిబంధన కింద ఆయన చర్చను ప్రారంభించారు. తన అరెస్ట్ జరిగిన తీరుపై ఆయన సభకు వివరించారు.
ట్రాన్స్ కో ఎ.ఇ లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడడ్డాని, అతన్ని ప్రభుత్వం వెనుకేసుకోస్తుందని విమర్శించారు. ట్రాన్స్ కో ఎ.ఇ. రికార్డులన్ని తప్పు అని రుజువుచేస్తానని, అలా కానీ పక్షంలో తన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కృష్ణారావు సవాల్ విసిరారు.
ప్రభుత్వం ఇందుకు సిద్దమేనా అని ఆయన ఛాలెంజ్ వేయడంతో అధికార పక్షం సభ్యుల ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కృష్ణారావు రాజకీయం చేస్తున్నారని వారు ఆరోపించారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి నాగం జనార్ధన రెడ్డి ఆవేశంగా కృష్ణారావు ప్రసంగానికి స్పందించారు. దాదాపు గంటసేపు సాగిన చర్చ ఎటూ తెగకుండానే ముగిసింది.