స్త్రీ అక్షరాస్యతకు ప్రత్యేక ప్రణాళిక
హైదరాబాద్:
రాష్ట్రంలో
మహిళా
అక్షరాస్యతపెంపునకు
ప్రత్యేక
ప్రణాళికను
రూపొందించనున్నట్లు
పాఠశాలవిద్యాశాఖ
మంత్రి
మండవ
వెంకటేశ్వరరావు
చెప్పారు.
శాసనసభ
ప్రశ్నోత్తరాల
సమయంలో
ఆయన
బుధవారం
ఈవిషయం
చెప్పారు.
అక్షర సంక్రాంతి వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం అక్షరాస్యత కార్యక్రమాన్నిపెద్దగా పట్టించుకోవడం లేదా అని కాంగ్రెస్ సభ్యుడువివేకానంద రెడ్డి అడిగారు. సంతకాలు చేయడం నేర్పి అదే అక్షరాస్యతఅంటున్నారని, అక్షరాస్యత సాధనకు కచ్చితమైన ప్రమాణాలు ప్రభుత్వం పాటిస్తున్నట్లు లేదని ఆయన అన్నారు. ఈవిషయాన్ని మంత్రి వెంకటేశ్వరరావు అంగీకరించలేదు.
నిరంతర విద్యా కేంద్రాల ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, అక్షరాస్యత కార్యక్రమాల అమలుపై సమీక్ష జరిపిస్తామని ఆయన చెప్పారు.అక్షర వాలంటీర్లకు గౌరవ వేతనం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.అక్షర సంక్రాంతి, అక్షర జ్యోతి వంటి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరగడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మొదటి, రెండు దశలఅక్షర కార్యక్రమం ఉత్సాహంగా జరిగిందని, మూడో దశలో కొంత నిరుత్సాహం చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, తగిన విధంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయనవివరించారు.