వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ సహా 17 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఫొక్కర్‌ మిలిటరీ ట్రాన్స్‌పోర్టు విమానం కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న పాకిస్థానీ ఎయిర్‌ఫోర్స్‌ ఛీఫ్‌ ముషాఫ్‌ అలీ మీర్‌తో పాటు 17 మంది మరణించారు. ఈ ఘోర ప్రమాదం గురువారం పాకిస్థాన్‌ వాయవ్య ప్రాంతంలో జరిగినట్లు ప్రభుత్వ టెలివిజన్‌ ప్రకటించింది.

ఇస్లామాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాద స్థలానికి సహాయక బృందాలను పంపారు. ఇస్లామాబాద్‌కు సమీపంలో గల చక్లాలా ఎయిర్‌ బేస్‌ నుంచి ఈ విమానం బయలుదేరి పంజాబ్‌ ప్రొవిన్స్‌లో కోహత్‌ వైపు ప్రయాణమైంది. వాతావరణం బాగా లేకపోవడంతో ఈ విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X