వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాకప్‌ నుంచి అండర్‌ ట్రయల్స్‌ పరారీ

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌ పట్టణంలోని సివిల్‌ కోర్టు ఆవరణలోని లాకప్‌ను బద్దలు కొట్టి ఎనమండుగురు అండర్‌ ట్రయల్స్‌ పారిపోయారు. పారిపోయినవారిలో పేరు మోసిన రాజేష్‌ సింగ్‌ అలియాస్‌ కైలా కూడా ఉన్నాడు.

పోలీసు సూరింటిండెంట్‌ రాజేష్‌ చంద్ర కథనం ప్రకారం- ఒక కేసుకు సంబంధించి జిల్లా, సెషన్స్‌ జడ్జి ముందు హాజరు పరచడానికి విచారణలో ఉన్న ఖైదీలను తీసుకొచ్చి, లాకప్‌లో వుంచారు. ఇది పురాతన కట్టడం. పోలీసులు లాకప్‌ ముందు ద్వారం వద్ద కాపలా వున్నారు. అయితే అండర్‌ ట్రయల్స్‌ బుధవారంనాడు లాకప్‌ వెనుక తలుపులు బద్దలు కొట్టి ఒక్కరొక్కరే జారుకున్నారు.

జిల్లాలోని పోలీసు స్టేషన్లను అన్నింటినీ అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. హత్య, లూటీ, కిడ్నాప్‌లకు సంబంధించిన కేసుల్లో నిందితులైన వీరిని బెగుసరాయ్‌ డివిజనల్‌ జైలులో వుంచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X