వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాకప్ నుంచి అండర్ ట్రయల్స్ పరారీ
పాట్నా:
బీహార్లోని
బెగుసరాయ్
పట్టణంలోని
సివిల్
కోర్టు
ఆవరణలోని
లాకప్ను
బద్దలు
కొట్టి
ఎనమండుగురు
అండర్
ట్రయల్స్
పారిపోయారు.
పారిపోయినవారిలో
పేరు
మోసిన
రాజేష్
సింగ్
అలియాస్
కైలా
కూడా
ఉన్నాడు.
పోలీసు సూరింటిండెంట్ రాజేష్ చంద్ర కథనం ప్రకారం- ఒక కేసుకు సంబంధించి జిల్లా, సెషన్స్ జడ్జి ముందు హాజరు పరచడానికి విచారణలో ఉన్న ఖైదీలను తీసుకొచ్చి, లాకప్లో వుంచారు. ఇది పురాతన కట్టడం. పోలీసులు లాకప్ ముందు ద్వారం వద్ద కాపలా వున్నారు. అయితే అండర్ ట్రయల్స్ బుధవారంనాడు లాకప్ వెనుక తలుపులు బద్దలు కొట్టి ఒక్కరొక్కరే జారుకున్నారు.
జిల్లాలోని పోలీసు స్టేషన్లను అన్నింటినీ అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. హత్య, లూటీ, కిడ్నాప్లకు సంబంధించిన కేసుల్లో నిందితులైన వీరిని బెగుసరాయ్ డివిజనల్ జైలులో వుంచారు.
Comments
Story first published: Thursday, February 20, 2003, 23:53 [IST]