భూపంపిణీపై అసెంబ్లీలో వివాదం
హైదరాబాద్:
కడప
జిల్లాలో
దళితులకు
భూపంపకం
వ్యవహారంపై
గురువారం
శాసనసభలో
రభస
జరిగింది.
కడప
జిల్లాలోని
తిమ్యయ్యగారిపల్లెలో
గ్రామ
బహిష్కరణకు
గురైన
దళితులకు
భూమి
పంపకం
విషయంలో
ప్రభుత్వం
నిర్లక్ష్యం
ప్రదర్శిస్తోందని
కాంగ్రెస్
సభ్యులు
విమర్శించారు.
గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వం దళితులకు భూమి పంచడం లేదని ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశాన్ని శాసనసభలో ఎన్ని మార్లు లేవనెత్తినా, ఈ అంశంపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం కనిపించలేదని ఆయన అన్నారు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
కాంగ్రెస్ సభ్యులు వ్యవహారశైలికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జోక్యం చేసుకుని- ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టాలో మీరు చెప్తే నేనెందుకు, మంత్రులెందుకు అని ఆయన అడిగారు. తిమ్మయగారి పల్లె దళితులకు తమ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని, భూములు పంచి తీరుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.