వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే మార్చికి రాజధానికి కృష్ణాజలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే ఏడాది నాటికి రాజధానికి కృష్ణాజలాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం కృష్ణాజలాల ప్రాజెక్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే మార్చినాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈ నవంబర్‌ నాటికి విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని ఆయన చెప్పారు.

గవర్నర్‌ ప్రసంగంపై నాలుగు రోజులుగా సాగుతోన్న చర్చకు ఆయన శుక్రవారం సమాధానమిచ్చారు. గవర్నర్‌ ప్రసంగంలో కొత్తదనం లేదన్న విపక్షాల వాదనను ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ హయంలో అసలు అభివృద్ది జరగలేదని, వారు చేసిన తప్పుల ఫలితమే ఈ రోజు అనుభవిస్తున్నామని ఆయన అన్నారు.

కరువుపై కాంగ్రెస్‌ రాజకీయం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. 8,400 గ్రామాలు కరువు బారిన పడ్డాయని, అన్ని గ్రామాలకు నిధులు కేటాయించడం సాధ్యం కాదని చెప్పారు. నిధులకు బదులు...పని లేని వారిని గుర్తించి వారికి పనికల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X