వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దళితుడిపై దాడి కేసులో 4గురి అరెస్ట్
హైదరాబాద్: వారం రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా బాచుపల్లి గ్రామంలోని దళితుడిని అగ్రవర్ణాలు తీవ్రంగా కొట్టిన కేసులో పోలీసులు స్పందించారు. శుక్రవారం నలుగురి నిందితులను అరెస్ట్ చేశారు.
తమ ట్రాక్టర్ ల నుంచి డీజిల్ దొంగలించడాన్న నెపంతో కమ్మటి రాజు అనే దళిత యువకుడిని ఆ గ్రామనికి చెందిన అగ్రవర్ణాల వారు తీవ్రంగా కొట్టారు. కన్ను పూర్తిగా వాచేలా కొట్టి..అతన్ని హింసించారు. ప్రైవేట్ ఆసుప్రతిలో చేరిన రాజు పరిస్థితి విషమించడంతో ఆలస్యంగా ఈ విషయం పొక్కింది.
దీంతో కొంతమంది విద్యావంతుల సాయంతో రాజు కుటంబసభ్యులు కేసు పెట్టారు. పోలీసులు వెంటనే స్పందించి ఈ కేసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. రాజు పరిస్థితి తీవ్రంగా ఉంది.
Comments
Story first published: Friday, February 21, 2003, 23:53 [IST]