వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోటా విషయంలో కేంద్రం అశక్తురాలు
న్యూఢిల్లీ: పోటాను రాష్ట్రాలు దుర్వినియోగపర్చితే కేంద్రం జోక్యం చేసుకోలేదని ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ తెలిపారు. ఈ విషయంలో బాధితులు కోర్టును మాత్రమే ఆశ్రయించాలని ఆయన స్పష్టం చేశారు. బిలాసాపూర్ లోని ఓ ఎన్నికల సభలో ఆయన ఆదివారం ప్రసంగించారు.
పోటా అనేది తీవ్రవాద నిరోధక చట్టం. సాధారణ నేరస్తులకు వర్తించదు. అయితే, రాష్ట్రాలు ఎవరి విషయంలోనైనా దీన్ని దుర్వినియోగపర్చితే...న్యాయస్థానాల జోక్యమే సరైనా పరిష్కారమని ఆయన తెలిపారు.
పోటాను వ్యతిరేకిస్తోన్న పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. నిజానికీ ఈ పార్టీలు పోటాకు వ్యతిరేకం కాదు. మైనార్టీ ఓటు బ్యాంకులను సంతృప్తిపర్చేందుకు అలా మాట్లాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Story first published: Sunday, February 23, 2003, 23:53 [IST]