వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటా విషయంలో కేంద్రం అశక్తురాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పోటాను రాష్ట్రాలు దుర్వినియోగపర్చితే కేంద్రం జోక్యం చేసుకోలేదని ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ తెలిపారు. ఈ విషయంలో బాధితులు కోర్టును మాత్రమే ఆశ్రయించాలని ఆయన స్పష్టం చేశారు. బిలాసాపూర్‌ లోని ఓ ఎన్నికల సభలో ఆయన ఆదివారం ప్రసంగించారు.

పోటా అనేది తీవ్రవాద నిరోధక చట్టం. సాధారణ నేరస్తులకు వర్తించదు. అయితే, రాష్ట్రాలు ఎవరి విషయంలోనైనా దీన్ని దుర్వినియోగపర్చితే...న్యాయస్థానాల జోక్యమే సరైనా పరిష్కారమని ఆయన తెలిపారు.

పోటాను వ్యతిరేకిస్తోన్న పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. నిజానికీ ఈ పార్టీలు పోటాకు వ్యతిరేకం కాదు. మైనార్టీ ఓటు బ్యాంకులను సంతృప్తిపర్చేందుకు అలా మాట్లాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X