తప్పుల తడకలతో గుర్తింపుకార్డులు
హైదరాబాద్: రాష్ట్రంలో రెండో దశ ఫోటోగుర్తింపు కార్డుల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియ క్రితం సారి 60 శాతం చేపట్టగా ఈ సారి పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. అయితే, గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఈ ప్రక్రియ తప్పుల తడకలతో ప్రారంభమైంది. ఫోటో క్వాలిటీ లేకపోవడమే ప్రధాన సమస్య. డిజిటిల్ కెమెరాలను ఉపయోగిస్తున్నప్పటికీ క్వాలిటీ ఉండకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో గుర్తింపు కార్డుల జారీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ప్రధాన ఎన్నకల కమీషనర్ జె.ఎం.లింగ్డో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లాల్లోని మెయినాబాద్ మండలం అవ్దూపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఫోటో సరిగా వచ్చేవరకు కార్డులను జారీచేయకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తొలిసారి ఆన్ లైన్ ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేస్తుండడంతో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.