వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోమవారం వీఎచ్ పి పార్లమెంట్ ముట్టడి
న్యూఢిల్లీ: అయోధ్య ఆలయనిర్మాణం విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న తాత్సారవైఖరికి నిరసనగా విశ్వహిందూ పరిషత్ సోమవారం పార్లమెంట్ ను ముట్టడించాలని నిర్ణయించింది. ఆలయనిర్మాణం విషయంలో తమ వైఖరి మారేది లేదని వీఎచ్ పి స్పష్టం చేసింది.
అయితే, తమ నిరసన శాంతిపూర్వకంగా జరుగుతుందని పేర్కొంది. పార్లమెంట్ ముట్టడి కేవలం భారత శాసనకర్తలకు తమ వైఖరిని తెలియచేయడం కోసమేనని తెలిపింది. ప్రభుత్వంపై తాము ఒత్తిడి పెంచుతామని పేర్కొంది.
మరోవైపు, హైప్రోఫైల్ విఎచ్ పి గురువు రామచంద్ర పరమహంస ఆలయనిర్మాణానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఆలయనిర్మాణం ప్రధానం. అది జరుగుతుంది. కావాల్సిందల్లా భూమి సేకరణ. వచ్చే 6న సుప్రీం తీర్పు గురించి వేచి చూస్తున్నామని రామచంద్ర పరమహంస్ అన్నారు.
Comments
Story first published: Sunday, February 23, 2003, 23:53 [IST]