టాటా ఫైనాన్స్ మాజీ ఎండి అరెస్టు
న్యూఢిల్లీ:
టాటా
ఫైనాన్స్
మాజీ
మేనేజింగ్
డైరెక్టర్
డి.ఎస్.
పెండ్సేను
ఢిల్లీ
పోలీసులు
మంగళవారం
అరెస్టు
చేశారు.
ఒక
గ్రూప్
కంపెనీలో
రెండు
కోట్ల
రూపాయల
అవకతవకలకు
పాల్పడ్డారనే
అరోపణపై
ఆయనను
అరెస్టు
చేశారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్కు ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఆయనను అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమీషనర్ (క్రైం) యు.కె. కాట్నా చెప్పారు. టాటా ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఇన్సాహాల్లా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెండ్సేపై క్రైం బ్రాంచ్ నిరుడు సెప్టెంబర్లో కేసు నమోదు చేసి క్రైం బ్రాంచ్ పోలీసులు పరిశోధన జరిపారు. వ్యక్తిగత మార్పిడుల చెల్లింపు కోసం ఒక బ్రోకర్కు పెండ్సే రెండు కోట్ల రూపాయల చెక్ ఇచ్చినట్లు ఐఐఎల్ ఫిర్యాదు చేసింది.
పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కుట్రలకు సంబంధించిన కేసులను పెండ్సేపై నమోదు చేశారు. ఇటీవలే ఆయన అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు.