వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరవు సహాయానికి నిధుల మళ్లింపు
హైదరాబాద్:
కరవు
సహాయక
చర్యల
కోసం
వివిధ
ప్రభుత్వ
శాఖల
నిధులను
మళ్లించాలని
ప్రభుత్వం
నిర్ణయించింది.
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
మంగళవారం
ఈ
విషయం
చెప్పారు.
కరవు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాల తీరును సమీక్షించాలని ఆయన చెప్పారు. కరువు సహాయక చర్యలను, అమలవుతున్న కార్యక్రమాలను క్రోడీకరించాలని, ఈ వివరాలను తమకు మార్చి 3వ తేదీ లోగా ప్రభుత్వానికి అందించాలని ఆయన సూచించారు.
కరువు సహాయక చర్యలకు నిధుల కొరతగానీ, బియ్యం కొరతగానీ లేదని పునరావాస కమీషనర్ రోశయ్య సమావేశానంతరం విలేకరులతో చెప్పారు. కార్యక్రమాల అమలు తీరును పరిశీలించడానికి శని, ఆదివారాలు అధికారులు పర్యటించి సమీక్షిస్తారని ఆయన చెప్పారు. మార్చి 4వ తేదీన కరవుపై శాసనసభలో చర్చ జరుగుతుంది.
Comments
Story first published: Tuesday, February 25, 2003, 23:53 [IST]