వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆహారభద్రతకల్పనలో కేంద్రం విఫలం
హైదరాబాద్: దేశంలో ధాన్యనిల్వలు పేరుకుపోయినప్పిటికీ కేంద్రప్రభుత్వం ఆహారభద్రత కల్పించడంలో దారుణంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ధాన్యం నిండుగా ఉన్నదశలోనూ ఆకలిచావులు సంభవించడం సిగ్గుగా ఉందని టీడీపీ పేర్కొంది.
రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంట్లో జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి పాల్గొంటూ..కేంద్రం ఆహారభద్రత గురించి పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా స్పందించారు.
ఆహారభద్రత కల్పన లేనప్పుడు ఆకలిచావులు, పోషకాహారలోపాన్ని నివారించలేమని ఆయన పేర్కొన్నారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారికి ఆహారధాన్యాలు నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Story first published: Tuesday, February 25, 2003, 23:53 [IST]