వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమ్మూలో నలుగురు పౌరులు బలి
జమ్మూ:
జమ్మూ
డివిజన్లోని
రాజౌరి
జిల్లాలో
మిలిటెంట్లు
నలుగురు
పౌరులను
కాల్చి
చంపారు.
మిలిటెంట్లు
జరిపిన
కాల్పుల్లో
మరో
ఇద్దరు
గాయపడ్డారు.
ఈ
సంఘటన
సోమవారం
రాత్రి
జరిగినట్లు
అధికార
వర్గాలు
చెప్పాయి.
మిలిటెంట్లు సోయిట్ గ్రామంలోని ఒక దుకాణంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుకాణుదారుతో పాటు మరో ముగ్గురు కస్టమర్లు అక్కడికక్కడే మరణించారు.
ఆ తర్వాత మిలిటెంట్లు రాజౌరీ నుంచి జమ్మూ వెళ్తున్న ట్రక్కుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు.
Comments
Story first published: Tuesday, February 25, 2003, 23:53 [IST]