వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో నలుగురు పౌరులు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మూ డివిజన్‌లోని రాజౌరి జిల్లాలో మిలిటెంట్లు నలుగురు పౌరులను కాల్చి చంపారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగినట్లు అధికార వర్గాలు చెప్పాయి.

మిలిటెంట్లు సోయిట్‌ గ్రామంలోని ఒక దుకాణంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుకాణుదారుతో పాటు మరో ముగ్గురు కస్టమర్లు అక్కడికక్కడే మరణించారు.

ఆ తర్వాత మిలిటెంట్లు రాజౌరీ నుంచి జమ్మూ వెళ్తున్న ట్రక్కుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్‌, క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X