సాగునీటి సంఘాలకు ఏప్రిల్లో ఎన్నికలు
హైదరాబాద్:
సాగునీటి
వినియోగదారుల
సంఘాల
చట్టానికి
సవరణ
తెచ్చి,
ఈ
ఏడాది
ఏప్రిల్లో
ఆ
సంఘాలకు
ఎన్నికలు
నిర్వహిస్తామని
భారీ
నీటి
పారుదల
శాఖ
మంత్రి
కడియం
శ్రీహరి
చెప్పారు.
శాసనసభ
ప్రశ్నోత్తరాల
సమయంలో
ఆయన
సభ్యుల
ప్రశ్నలకు
సమాధానమిస్తూ
ఆయన
గురువారం
ఆ
విషయం
చెప్పారు.
ఉదాత్తమైన ఆశయాలతో ఏర్పాటు చేసిన సాగు నీటి సంఘాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడిన సాగునీటి సంఘాల పాలకవర్గాలపై చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. సాగునీటి సంఘాల చట్టానికి సవరణ తెస్తూ ఆర్డినెన్స్ను జారీ చేశామని, ఆ ఆర్డినెన్స్ను స్థానంలో చట్టం తెచ్చేందుకు ఒక బిల్లును ఈ శాసనసభ సమావేశాల్లో ప్రతిపాదిస్తున్నామని ఆయన చెప్పారు.
అంతకు ముందు బిజెపి సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ- సాగునీటి సంఘాల సభ్యులు కాంట్రాక్టర్లుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.