సామాన్యులపై జస్వంత్ కనికరం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ పేదలు, మధ్యతరగతి ప్రజలపై కనికరం చూపారు. ఆయన శుక్రవారం లోక్సభలో ప్రజాకర్షక బడ్జెట్ను ప్రతిపాదించారు. ఆర్థికాభివృద్ధికి ఆర్థిక పటిష్టత అవసరమని ఆయన అన్నారు.
పిల్లల ఫీజుల ఖర్చులు భరిస్తున్న తలిదండ్రులకు పన్ను రాయితీ కల్పించారు. గ్రామీణ ప్రాంతాల పేదలకు ఆరోగ్య సేవలను విస్తరించానికి కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్కు పెద్ద యెత్తున రాయితీలు ఇచ్చారు.
ఆర్థిక
మంత్రి
జస్వంత్
సింగ్
ప్రతిపాదించిన
బడ్జెట్లో
ఐదు
ప్రధాన
లక్ష్యాలున్నాయి.
ఈ
ఐదింటిలో
పేదరిక
నిర్మూలన,
పన్నుల
సంస్కరణ,
సర్వీసు
పన్ను
అమలు,
రాష్ట్రాల్లో
ఏప్రిల్
1వ
తేదీ
నుంచి
వ్యాట్
అమలు
ఉన్నాయి.
ఆరోగ్యానికి,
విద్యకు,
గృహనిర్మాణానికి
జస్వంత్
సింగ్
తన
బడ్జెట్లో
ప్రాధాన్యం
ఇచ్చారు.
ఆయన
శుక్రవారం
లోక్సభలో
2003-04వ
సంవత్సరం
బడ్జెట్ను
ప్రతిపాదించారు.
పన్నుల సంస్కరణల ద్వారా, అదనపు ఎక్సైజ్ సుంకం తొలగింపు ద్వారా ఆర్థిక పటిష్టతకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్పాదక రంగం సామర్థ్యం పెంపుతో పాటు వ్యవసాయ సంబంధ పరిశ్రమలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సంస్కరణల వేగవంతానికి ప్రాధాన్యం ఇచ్చింది.
భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల రంగంలో మరో హరిత విప్లవంపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ సంపద సమగ్ర పెరుగుదలకు స్వయం సమృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని జస్వంత్ సింగ్ చెప్పారు. వ్యవసాయంలో 3.5 శాతం, సర్వీసుల రంగాల్లో 7.1 శాతం, ఎగుమతుల్లో 20.4 శాతం పెరుగుదల ఉండగలదని ఆయన అన్నారు.