బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిపిఐ నిరసన
హైదరాబాద్:
కేంద్ర
ప్రభుత్వం
ప్రతిపాదించిన
బడ్జెట్ను
ప్రజావ్యతిరేకమైనదిగా
రాష్ట్ర
భారత
కమ్యూనిస్టు
పార్టీ
(సిపిఐ)
విమర్శించింది.
బడ్జెట్
ప్రతిపాదనలను
నిరసిస్తూ
సిపిఐ
కార్యకర్తలు
జాతీయ
ప్రజాస్వామ్య
కూటమి
(ఎన్డిఎ)
దిష్టిబొమ్మను
దగ్ధం
చేశారు.
ఎరువుల ధరలు, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడం వల్ల రైతులపై, సామాన్యులపై భారం పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు లాభాలు చేకూర్చే చర్యకు ప్రభత్వం పాల్పడిందనిఆయన అన్నారు. ఆరోగ్యబీమా వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.
అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రశంసించింది. అన్ని రంగాలకు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇచ్చిందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. యూరియా, పెట్రోల్ ధరలను సమీక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రాల అప్పులు 80 కోట్ల రూపాయలను కేంద్రం భరించడానికి సిద్ధపడడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆయన అన్నారు.