హిమాచల్లో కాంగ్రెస్ మెజారిటీ
సివ్లూ:
హిమాచల్
ప్రదేశ్లో
కాంగ్రెస్
పాలక
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)ని
కంగు
తినిపించింది.
68
స్థానాలు
గల
రాష్ట్ర
అసెంబ్లీలో
37
స్థానాలు
గెల్చుకుని
తిరుగులేని
ఆధిక్యతను
సాధించింది.
బిజెపి 17 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రామ్విలాస్ పాశ్వాన్ లోక్జనశక్తి ఒక సీటు గెల్చుకుంది. బిజెపి ఉద్దండులు పలువురు ఓటమి బాట పట్టారు. స్పీకర్ గులాబ్ చంద్ ఠాకూర్తో పాటు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జైకిషన్ శర్మ, ఐదుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి పి.కె. ధమాల్ బమ్సాన్ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయ్యారు.
అవినీతిని, అభివృద్ధి జరగకపోవడాన్ని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఎంచుకుంది. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ ఎన్నికల సారథి శాంతాకుమార్ అన్నారు.
కాంగ్రెస్తో
పాటు
వివిధ
పార్టీల
కూటమి
అయిన
మేఘాలయ
పీపుల్స్
ఫోరం
మేఘాలయలో
మెజారిటీ
సాధించింది.
శనివారం
సాయంత్రం
వరకు
40
స్థానాల
ఫలితాలు
వెలువడ్డాయి.
ఇందులో
కాంగ్రెస్
18
స్థానాలు
గెల్చుకుని
అతి
పెద్ద
పార్టీగా
అవతరించింది.
త్రిపురలో
వామపక్ష
కూటమి
ముందంజలో
ఉంది.
శనివారం
సాయంత్రం
వరకు
ప్రకటించిన
27
స్థానాల్లో
వామపక్ష
కూటమి
18
సీట్లు
గెల్చుకుంది.
మరో
15
స్థానాల్లో
వామపక్ష
కూటమి
అభ్యర్థులు
ముందంజలో
ఉన్నారు.