వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాత్తానుకుళం అన్నాడిఎంకె కైవసం
చెన్నై: తమిళనాడులోని సాత్తానుకుళం అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 26న జరిగిన ఉపఎన్నికల్లో అధికారపార్టీ విజయం సాధించింది. శనివారం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. అధికార అన్నాడిఎంకె పార్టీ అభ్యర్థి ఎల్.నీలమేఘవర్ణం గెలుపొందినట్లు ఎన్నికల శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. నీలమేఘవర్ణం తన సమీప అభ్యర్థి ఆర్.మహేంద్రన్ (కాంగ్రెస్)పై 15వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
డిఎంకె ఉప ఎన్నికలను బహిష్కరించింది. బీజెపీ, ఇతర పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొనేందుకు నిరాకరించడంతో అన్నాడిఎంకె, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. ముఖ్యమంత్రి జయలలిత తమ పార్టీ అభ్యర్థి గెలుపొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. డిఎంకె ఎంత అరిచి గోల పెట్టినా, ప్రజలు మా వైపు ఉన్నారనే మరోసారి రూఢీ అయిందని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Saturday, March 1, 2003, 23:53 [IST]